విశాఖపట్టణం: దీపావళి పండుగ సందర్భంగా పటాకుల సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13)తో కలసి దివ్య అనే బాలిక శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు తీవ్రంగా కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.