వారం రోజుల్లోనే రూ. 500కే గ్యాస్ .. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

  వారం రోజుల్లోనే రూ. 500కే గ్యాస్ .. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వేల కోట్లు రూపాయలు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లుగా తీసుకున్నారని ఆరోపించారు .  పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కొడంగల్ లో నిర్వహించిన భారీ  బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.  

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.  వారం రోజుల్లో రూ.500కు గ్యాస్ సింలిండర్,  200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో  ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు.   రైతు రుణమాఫీ కూడా చేపడాతామని తెలిపారు. రైతు భరోసాను పది రో జుల్లో అర్హులందరి అకౌంట్లలో  వేస్తామని చెప్పారు. 

గతంలో మహబూబ్ నగర్ కు వలస వచ్చి ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ ఇక్కడి ప్రాంతానికి అన్యాయం చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలన కంటే రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ  ఎక్కువగా అన్యాయానికి గురయైందన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చీ కొట్టిన సిగ్గురాలేదని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ పాలమూరులో సభ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ హోదా ప్రకటిస్తామని చెప్పి ఎందకు చేయలేదని ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉండి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు.ఇంకా కాంగ్రెస్ పార్టీ యుద్ధం ముగియలేదని పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చేల కార్యకర్తలు పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.