ఇస్లామాబాద్: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న భారత్పై ట్రంప్ టారిఫ్ తగ్గించారు. దీంతో సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో పాకిస్తాన్ మాత్రం వెనకబడిందని, తమ దేశంపై ట్రంప్ 19% టారిఫ్ వసూలు చేస్తున్నాడని పాక్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం, సైన్యంపై సొంత పౌరులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీడీఎఫ్ అసిమ్ మునీర్ చేతకానితనమేనని వారు మండిపడుతున్నారు.
‘నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను పాకిస్తాన్ నామినేట్ చేసింది. మినరల్స్ బ్రీఫ్కేస్ బహుమతిగా ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి సమితిలోనూ చేరింది. వీలైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తింది. అయినా ట్రంప్.. పాకిస్తాన్పై 19% టారిఫ్ వసూలు చేస్తున్నారు. కానీ, భారత్ ఇప్పటిదాకా ట్రంప్ను ప్రశంసించలేదు. నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేయలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ఆదేశించినా పట్టించుకోలేదు.
అయినా ట్రంప్.. ఇప్పుడు భారత్కే సపోర్ట్ చేస్తున్నారు. భారత్పై పాక్ కంటే 1% తక్కువే టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించారు. మంచి ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకున్నారు" అని పాక్ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ రాజకీయ నేతలు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్రంప్ను కలుస్తారని.. వారికి దేశ ప్రయోజనాలతో పనిలేదని మండిపడుతున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలినా దేశాన్ని పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడీఎఫ్ అసిమ్ మునీర్ను ట్రంప్ సీక్రేట్ లవర్లా మాత్రమే చూస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మునీర్కు షూ పాలిష్ లేయర్స్ అప్లై చేసే అవకాశం తప్ప ట్రంప్ ఏమీ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు, హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.
