
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ ఆఫీసులో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటుచేసిన పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చూడాలన్నారు. ఎక్కువగా వానలు కురుస్తుండటం వల్ల రోడ్లపై ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్ సందర్భంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, సీఐలు రవిబాబు, టాటాబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.