జిల్లాల వారీగా పర్యాటక ప్రదేశాల వివరాలు

జిల్లాల వారీగా పర్యాటక ప్రదేశాల వివరాలు

తెలంగాణలో విస్తృతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ప్రకృతికి సంబంధించిన పర్యాటక గమ్యస్థానాలు 33 జిల్లాల్లో విస్తరించి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాలపైన పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో ఏయే ప్రాంతాలు ఏయే జిల్లాల పరిధిలో ఉన్నాయోనేది తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పర్యాటక ప్రదేశాల వివరాలను తెలుసుకుందాం.   

హనుమకొండ: ఆలయాలు: భద్రకాళి ఆలయం, పద్మాక్షి ఆలయం, 1000 స్తంభాల గుడి

వారసత్వ ప్రదేశాలు: 1000 స్తంభాలు, వరంగల్​ కోట, వన్యప్రాణుల అభయారణ్యం: వన విజ్ఞాన కేంద్రం, మినీ జూ, ప్రకృతి ఆవిష్కరణలు: మ్యూజికల్​ గార్డెన్​, రాక్​ గార్డెన్​, రీజినల్​ సైన్స్​ సెంటర్, పాకాల్​ సరస్సు

నిర్మల్: ఆలయాలు: బాసర సరస్వతి, కాల్వ నరసింహా స్వామి ఆలయాలు, వారసత్వ ప్రదేశం: నిర్మల్​కోట, ప్రకృతి ప్రదేశం: కడెం ప్రాజెక్టు.

ఆదిలాబాద్​:  జైనథ్​​ ఆలయం, ప్రకృతి ఆవిష్కరణ: గాయత్రి, కుంటాల, పొచ్చెర జలపాతాలు

మంచిర్యాల: వన్యప్రాణి అభయారణ్యాలు: శివరాం వన్యప్రాణి అభయారణ్యం(పెద్దపల్లి జిల్లాలోనూ ఉంది), జన్నారం, కావల్​, ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యాలు

నిజామాబాద్​: ఆలయాలు: కంఠేశ్వర్​, ఖిల్లా, డిచ్​పల్లి రామాలయాలు, సారంగాపూర్​ హనుమాన్​ మందిరం, వారసత్వ ప్రదేశం: నిజామాబాద్​ కోట, ప్రకృతి 

ఆవిష్కరణ: అలీసాగర్​ రిజర్వాయర్​, మల్లారం అడవి, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు, 

వన్యప్రాణి అభయారణ్యాలు: అలీసాగర్​ జింకల పార్క్​

సిద్దిపేట : ఆలయాలు: కోటి లింగేశ్వర స్వామి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, విద్యా సరస్వతి క్షేత్రం. 

నల్లగొండ: ఆలయాలు: మహాత్మాగాంధీ ఆలయం(చిట్యాల), వారసత్వ ప్రదేశం: దేవరకొండ కోట, కొలనుపాక జైన ఆలయం, నాగార్జున సాగర్​, నందికొండ, రాచకొండ కోట. 

ప్రకృతి ఆవిష్కరణ: నాగార్జున సాగర్​. 

యాదాద్రి భువనగరి: ఆలయాలు: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సురేంద్రపురి– పౌరాణిక థీమ్​ పార్కు. వారసత్వ ప్రదేశం: భువనగరి కోట. 

రంగారెడ్డి: పర్యాటక గమ్యస్థానాలు: రామోజీ ఫిల్మ్​ సిటీ, హైటెక్​ సిటీ, ఉస్మాన్​ సాగర్​ డ్యాం, మహేశ్వరంలోని మత స్థలాలు, శిల్పారామం థీమ్​ విలేజ్​, ఓషియన్​ పార్క్​, షామీర్​పేట సరస్సు, అనంతగిరి కొండలు, ఆలయాలు: చిలుకూరి బాలాజీ మందిరం, సంఘీ మందిరం, కీసరగుట్ట, సమతామూర్తి విగ్రహం, వన్యప్రాణుల అభయారణ్యాలు: మహావీర్​ వనస్థలి జాతీయపార్క్​, మృగనయని జాతీయ పార్కు, చిల్కూరు.

కరీంనగర్​ : ఆలయాలు: నగునూరు ఆలయం, వారసత్వ ప్రదేశం: ఎలగందల కోట, మొలంగూరు కోట, సిల్వర్​ ఫిలిగ్రీ, ప్రకృతి ఆవిష్కరణ: దిగువ మానేరు డ్యాం, వన్యప్రాణి అభయారణ్యాలు: ఉజ్వల జింకల పార్క్​

పెద్దపల్లి : వారసత్వ ప్రదేశం: రామగిరి ఖిలా(కోర్టు), ధూళికట్ట. వన్యప్రాణి అభయారణ్యం: శివరాం వన్యప్రాణి అభయారణ్యం (మంచిర్యాలలోనూ ఉంది), 

ప్రకృతి ఆవిష్కరణ: సబితం జలపాతం

జగిత్యాల: ఆలయాలు: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం(ధర్మపురి). 

వారసత్వ ప్రదేశం: జగిత్యాల కోట

రాజన్న సిరిసిల్ల: ఆలయాలు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం

ఖమ్మం : ఆలయాలు: జమలాపురం ఆలయం, కూసుమంచి శివలింగం(కల్లూరు), 

వారసత్వ ప్రదేశం: నేలకొండపల్లి విగ్రహాలు, ఖమ్మంకోట, 

ప్రకృతి ఆవిష్కరణ: పేరంటాలపల్లి కొండలు, వన్యప్రాణి అభయారణ్యాలు: కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం.

భద్రాద్రికొత్తగూడెం: ఆలయాలు: భద్రాచలం సీతారామ స్వామి వారి ఆలయం, వారసత్వ ప్రదేశం: పర్ణశాల – శ్రీరామశకం

మహబూబ్​నగర్: ఆలయాలు: మన్యంకొండ(వెంకటేశ్వర ఆలయం), గంగాపురం, జడ్చర్ల (చెన్నకేశవస్వామి ఆలయం), సీతారామచంద్ర స్వామి ఆలయం, సిరిసనగండ్ల, కురుమూర్తి రాయుడు, కొత్తకోట, వారసత్వ ప్రదేశం: పిల్లలమర్రి, గొప్ప మర్రి చెట్టు, 

ప్రకృతి ఆవిష్కరణ: కోయిల్​ సాగర్​

జోగులాంబ గద్వాల: ఆలయాలు: ఆలంపూర్​ జోగులాంబ ఆలయం, వారసత్వ ప్రదేశం: గద్వాల్​ కొండ కోట, 

ప్రకృతి ఆవిష్కరణ: ప్రియదర్శిని జూరాల ఆనకట్ట. 

వనపర్తి : ప్రకృతి ఆవిష్కరణ: సరళా సాగర్​ ఆనకట్ట

మెదక్: ఏడుపాయల వనదుర్గాభవాని  ఆలయం, మెదక్​ చర్చి, అల్లాదుర్గ్​, వారసత్వ ప్రదేశం: మెదక్​ కోట, 

ప్రకృతి ఆవిష్కరణ: పోచారం రిజర్వాయర్​ ఎదితనూర్​(నియోలిథిక్​ యుగాల నాటి అందమైన గుహల పెయింటింగ్​లకు పేరు గాంచిన గ్రామం ఎదితనూర్​) పోచారం వన్యప్రాణి అభయారణ్యం. 

జయశంకర్​ భూపాలపల్లి : ఆలయాలు: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, ప్రకృతి ప్రదేశాలు: బొగత జలపాతాలు, 

వన్యప్రాణుల అభయారణ్యం: తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం.

తాడ్వాయి వన్యప్రాణుల అభయారణ్యం: వన్యప్రాణుల ప్రాముఖ్యం దృష్ట్యా ఈ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్ర అటవీశాఖ ఇక్కడ వనజీవన్​ (తాడ్వాయి హట్స్​ – కాంప్లెక్స్​) అనే అటవీ రిపోర్టును లోతైన రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో నిర్మించి అభివృద్ధి చేసింది. 

దామరవాయి: తాడ్వాయి నుంచి 15 కి.మీ.ల దూరంలోని దామరవాయిలో మెగాలలిథిక్​ శ్మశాన నిర్మాణాలు ఉన్నాయి. ఈ సమాధులు 10,000 ఏండ్ల క్రితం ఇక్కడ చరిత్ర పూర్వ మానవుని ఉనికికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇవి ప్రత్యేక నిర్మాణాలు మెగాలిథిక్​ నిర్మాణపు ఒకే గది – రెండు లేదా అంత కంటే ఎక్కువ నిర్మాణాలతో క్యాప్​స్టోన్​ యుక్తంగా క్షితజ సమాంతరంగా ఉంది. 

మల్లూరు: ఇది ఏటూరు నాగారం నుంచి 5 కి.మీ.ల దూరంలో ఉంది. అడవి గుండా ప్రవహించే నీటి బుగ్గ చింతామణి జలపాతం ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైంది. 

బొగత జలపాతాలు: వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఈ అందమైన జలపాతం దట్టమైన అడవిలో 30 మీటర్ల పొడవుతో 200 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని స్థానికంగా తెలంగాణ నయాగరా జలపాతం అంటారు. 

ములుగు: ఆలయాలు: రామప్పదేవాలయం, సమక్క సారలమ్మ జాతర, వారసత్వ ప్రదేశాలు:

రామప్ప ఆలయం: ఇది శివాలయానికి ప్రసిద్ధి. దీనిని కాకతీయ రాజులు నిర్మించారు. దీనిని 2021లో యునైటెడ్​ నేషన్స్​ ఎడ్యుకేషనల్​ సైంటిఫిక్​ అండ్​ కల్చరల్ ఆర్గనైజేషన్​ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది ములుగు నుంచి 15 కి.మీ.లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. 
లక్నవరం సరస్సు: ఇది ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. అందమైన పచ్చటి కొండల వలయంతో చుట్టిఉన్న ఒక విశాలమైన సరస్సు. ఇక్కడ పచ్చని ద్వీపాలు, నిర్మలమైన జలాలు, పొడవైన వేలాడే వంతెన ఉంది. 160 మీటర్ల పొడవైన వేలాడే వంతెన ఈ గమ్యస్థానపు ప్రత్యేక ఆకర్షణ.