
టాలీవుడ్ ప్రముఖ హీరో సిద్దు జొన్నలగడ్డ తెలుగులో క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల చిత్రాల ఫేమ్ దర్శకుడు రవికాంత్ పీరేపు డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే దసరా పండుగ సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు రిలీజ్ విషయాలను చిత్ర యూనిట్ తెలిపారు.
Also Read :- మా నమ్మకాన్ని ఆడియెన్స్ ప్రూవ్ చేశారు
ఇందులో భాగంగా ఈ చిత్రానికి కోహినూర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అలాగే 2026వ సంవత్సరంలో జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయనికి సంబంధించిన పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్ లో సిద్దు వజ్రాన్ని పట్టుకుని కనిపిస్తాడు. సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ కామెడీ, లవ్ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించిన సిద్దు జొన్నలగడ్డ మొదటిసారిగా సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ చిత్రంతో ప్రయోగం చేయనున్నాడు.
We have been patient for around 1000 years to claim what rightfully belongs to us ?
— Naga Vamsi (@vamsi84) October 12, 2024
Behold, he will bring back the glory of Goddess Bhadrakali ? #HappyDussehra everyone ❤️?
Presenting you our dearest Starboy ? #Siddu in #Kohinoor - Part 1 ~ In Cinemas January 2026 ?… pic.twitter.com/5YppH1vQEw
తెలుగులో విభిన్న కథనాలు ఎంచుకుంటూ సరికొత్తగా డీజే టిల్లు మూవీ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరీర్ ఆరంభించిన కొత్తలో కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ డీజే టిల్లు చిత్రం తర్వాత సిద్దు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇటీవలే సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.