కాంగ్రెస్ ​నేతలకు డబ్బులందాయని ప్రజలు అనుకుంటున్నరు: డీకే అరుణ

కాంగ్రెస్ ​నేతలకు డబ్బులందాయని ప్రజలు అనుకుంటున్నరు: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్​ నేతలకు డబ్బులు అందా యని ప్రజలు అనుకుంటున్నారని.. ఈటల రాజేందర్ ​చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గుమ్మ డికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు రేవంత్​రెడ్డి తీరు ఉందన్నారు. మీడియాలో ఉండేందుకే ఆయన డ్రామాలు ఆడుతున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్​రెండూ ఒకటేనని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ఇదే మాట ఈటల బహిరంగంగా చెప్తే అంత రోషమెందుకన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు, బలహీన వర్గాల నేతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీఆర్ఎస్​ కాంగ్రెస్​తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో తేలిపోయిందన్నారు.