డీకే శివకుమార్ కస్టడీ 25 వరకు పొడిగింపు

డీకే శివకుమార్ కస్టడీ 25 వరకు పొడిగింపు

న్యూ ఢిల్లీ: మనీ లాండరింగ్  కేసులో కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 25 న శివకుమార్ చేసిన బెయిల్ అప్పీల్​కు నో చెప్పిన కోర్టు  ఆయననుజ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. లేటెస్ట్ గా ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేసిన​ రిక్వెస్ట్ మేరకు మంగళవారం స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ట్యాక్స్ ఎగ్గొట్టడం, కోట్ల విలువైన హవాలా ట్రాన్సాక్షన్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఈడీ కిందటేడాది శివకుమార్​తో పాటు హనుమంతయ్య, మరో ముగ్గురు అనుచరులపై చార్జిషీట్ దాఖలు చేసింది.