మైనారిటీలకు 4% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తం

 మైనారిటీలకు 4% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తం

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీలకు 4% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ఈ రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీ జాబితాలో కేటగిరీ 2బీ కింద ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేజన్లు రద్దు చేసి, వీరశైవ లింగాయత్‌‌‌‌‌‌‌‌లకు 2 శాతం, వొక్కలిగ వర్గాలకు మరో 2 శాతం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లను ఆస్తిలా పంచవచ్చని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని పేర్కొన్నారు. .