గోడ దూకి మరీ అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటు: స్టాలిన్

గోడ దూకి మరీ అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటు: స్టాలిన్

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అరెస్ట్ పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.  డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ విషయంపై చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ… చిదంబరం ముందస్తు బెయిల్ అడిగినా కూడా ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసిందని, కేవలం  రాజకీయ కక్షతోనే చిదంబరాన్ని అరెస్ట్ జరిగిందని ఆయన అన్నారు. చిదంబరం అరెస్ట్ ను ఖండిస్తున్నానన్నారు. సీబీఐ అధికారులు గోడ దూకి మరీ ఓ మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటని ఆయన అన్నారు.

చిదంబరం ఓ న్యాయ నిపుణుడని, ఆయన ఈ కేసును ఖచ్చితంగా లీగల్ ఎదుర్కొంటారని స్టాలిన్ అన్నారు. ఆయన అరెస్ట్ కు వ్యతిరేకంగా గురువారం ఢిల్లీలో నిరసన నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ నిరసన లో మరో 14 పార్టీలు పాల్గోనబోతున్నట్టు స్టాలిన్ చెప్పారు.