హైదరాబాద్, వెలుగు: చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) ఆదేశాల మేరకు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసిన భూముల్లో ఇంటి నిర్మాణాలు, లే అవుట్లకు తాత్కాలికంగా అనుమతులను నిలిపేస్తున్నట్లు బల్దియా కమిషనర్ ఆదివారం సర్క్యూలర్ జారీ చేశారు.
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు 2023 ఆగస్టు 17న జారీ అయిన జీవో 59 పట్టాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ అధికారులను ఆదేశించారు. అక్రమార్కులకే న్యాయం జరిగిందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. బీఆర్ఎస్నేతలు లబ్ధిపొందారనే ఆరోపణలు, ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.