మార్గదర్శి చిట్స్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాల్లో జోక్యం వద్దు

మార్గదర్శి చిట్స్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాల్లో జోక్యం వద్దు

 

  • మార్గదర్శి చిట్స్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాల్లో జోక్యం వద్దు
  • ఏపీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌‌‌‌‌‌‌‌ఫండ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ వ్యాపార కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని ఏపీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కంపెనీలో సోదాల పేరిట రోజువారీ కార్యకలాపాలను అడ్డుకోవద్దని జస్టిస్‌‌‌‌‌‌‌‌ ముమ్మినేని సుధీర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీలో  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులు తనిఖీలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని మార్గదర్శి చిట్‌‌‌‌‌‌‌‌ఫండ్స్ ఉపాధ్యక్షుడు పి.రాజాజీ వేసిన పిటిషన్ల విచారణ కోర్టు జూన్‌‌‌‌‌‌‌‌కు వాయిదా వేసింది. ఇతర మార్గదర్శి కేసులతో కలిపి ఈ రిట్‌‌‌‌‌‌‌‌ను కూడా విచారిస్తామని పేర్కొంది. కాగా..మార్గదర్శి చిట్‌‌‌‌‌‌‌‌ఫండ్‌‌‌‌‌‌‌‌ అక్రమాలపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు విచారణ జరపడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ కేసు తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రాదని పేర్కొంది.