దళిత ఉద్యమాలు ఎప్పడు పుట్టాయో, ఈ ఉద్యమాల నాయకులెవరో తెలుసా..?

దళిత ఉద్యమాలు ఎప్పడు పుట్టాయో, ఈ  ఉద్యమాల నాయకులెవరో తెలుసా..?

దేశంలో దళిత ఉద్యమాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటిలో మహర్, ఆది హిందూ, ఆది ఆంధ్ర, రిపబ్లికన్ పార్టీ, దళిత్ పాంథర్స్ ఉద్యమా లు ముఖ్యమైనవి. వీటి నుంచి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్య దళిత ఉద్యమాలు, ముఖ్యమైన నాయకుల గురించి తెలుసుకుందాం...

దళితులు చాతుర్వర్ణ వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందినవారు. వీరిని అపర్ణులు, పంచములు, అస్పృశ్యులు అంటారు. దళిత ఉద్యమాలను సంస్కరణా త్మక, ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా విభజించవచ్చు. సంస్కరణ ఉద్యమాల లక్ష్యం సమాజంలో అస్పృశ్యతను నివారించడానికి కుల వ్యవస్థను సంస్కరించడం. ప్రత్యామ్నాయ ఉద్యమాల లక్ష్యం నూతన సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను స్థాపించడం.

మహర్ ఉద్యమం: మహారాష్ట్రలో మహర్ ఉద్యమాన్ని గోపాల్ బాబా వాలంగేకర్ ప్రారంభించారు. దోష పరిహారక మండలిని స్థాపించారు. సమాజంలో ఎదురవుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని దళితులకు పిలుపు ఇచ్చాడు. దళిత కులాల నుంచి వచ్చిన తొలి పోరాట యోధుడిగా గోపాల్ బాబా వాలంగేకర్ ను మహారాష్ట్ర ప్రజలు భావిస్తారు. 1913లో మహారాష్ట్రలోని కుల సంఘాలు మహాసభను నిర్వహించి అంటరానితనం గురించి చర్చించారు.

అప్రెస్డ్ ఇండియా అసోసియేషన్ : అప్రెస్డ్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థను నాగ్ పూర్ శివరాం జాంబకాంబ్లే ప్రారంభించాడు. 1909లో సోం వంశీమిత్ర అనే పత్రికను పుణె నుంచి నిర్వహించాడు. దళితుల్లో మూఢ ఆచారాలు, దేవదాసి, పోతురాజు వ్యవస్థలను రూపుమాపేందుకు కృషి చేశాడు. పుణెలో రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసి దళితుల్లో విద్యావ్యాప్తికి యత్నించాడు. గ్రంథాలయాలను ఏర్పాటు చేసి చరిత్ర పట్ల దళితులకు అవగాహక కల్పించాడు.

ఆది హిందూ ఉద్యమం : దేశంలో అంటరాని వారే మూలవాసులు అని, వారికి ఆది హిందువులు అనే పేరు పెట్టారు భాగ్యరెడ్డి వర్మ.  అంబేద్కర్, గాంధీ కంటే ముందే అంటరాని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించాడు. ఈ మండలి స్థాపన దేశంలో దళిత ఉద్యమానికి నాందిగా చెప్పవచ్చు. అంటరాని వారి దుర్భర జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి సభల నిర్వహణ, విద్యావ్యాప్తి, పుస్తకాల ద్వారా చైతన్యం కలిగించడానికి కృషి చేసింది. జగన్ మిత్ర మండలి 1911లో మన్య సంఘంగా మారింది. ఇసామియాబజార్, లింగంపల్లిలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాడు. దేవదాసి, జోగిని దురాచారాల నిర్మూలనకు ప్రత్యేకంగా దేవదాసి నిర్మూలన సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం నిరంతర కృషి వల్ల నిజాం ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేధించింది. 1912లో భాగ్యరెడ్డి వర్మ అహింసా సమాజాన్ని స్థాపించాడు. ఇది ది దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ గా మారింది. ఈ సంస్థ ప్రభావంతో 1920లో నిజాం ప్రభుత్వం గోవధను నిషేధించింది. ఇంటి పని మనుషుల కోసం విశ్వ గృహ పరిచారిక సమ్మేళనాన్ని స్థాపించాడు. వీటి ప్రభావంతో నిజాం ప్రభుత్వం 1931 జనాభా లెక్కల్లో వీరిని ఆది హిందువులుగా పేర్కొన్నది. అణగారిన వర్గాలకు వేదిక కల్పిస్తూ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు. ఈ పత్రిక పేరును ఆది హిందూగా మార్పుచేసి 1937 నుంచి మాస పత్రికగా వెలువరించారు.


ఆది ఆంధ్ర ఉద్యమం : మద్రాస్ రాష్ట్రంలో ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో ఆది ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. 1917లో బెజవాడలో గూడూరు రామచంద్రరావు పంచమ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ సభకు అధ్యక్షుడైన భాగ్యరెడ్డి వర్మ ప్రసంగిస్తూ పంచమ పదం వాడటం సరికాదని భావించి ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్ గా నామకరణం చేశాడు. ఈ సదస్సులోనే ఆది ఆంధ్ర సభగా ఆవిర్భవించింది. దళితులకు భూమి, విద్య, ఉద్యోగా వకాశాలు, పాలనలో ప్రాతినిధ్యం గురించి పోరాటం చేసింది. ప్రభుత్వ సర్వీసులో రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలు, అంటరానితనం అనే అంశాల పై ఆది ఆంధ్రసభ ఉద్యమించింది. 


రిపబ్లికన్ పార్టీ: షెడ్యూల్ కులాల ఫెడరేషన్ పేరును 1957లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు.  దీని స్థాపకుడు శివరాజ్. రాజ్యాంగంలోని ప్రాథమిక భావాలైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సమ న్యాయం, సౌభ్రాతృత్వానికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్పీఐ ఏర్పడింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారిని సమీకరించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దున్నేవాడికి భూమి ఇవ్వాలి. మిగులు భూమిని పంచాలి. ధరలను నియంత్రించాలి. సమాజంలో ఉన్న అంతరాలు, అసమానతలను తొలగించేందుకు పీడిత వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రధాన లక్ష్యాలు.

దళిత్ పాంథర్స్: ఈ ఉద్యమ నాయకులు అరుణ్ కాంబ్లే, రాజధాలే. ఇందులో భాగంగా దళిత్ పాంథర్స్ సంస్థను ముంబయిలో నాందేవ్ దాసల్, జేవీ పవార్ 1972లో స్థాపించారు. దళిత్ పాంథర్స్ ఉద్యమం అమెరికాలో నల్లజాతి ప్రజలు నిర్వహించిన బ్లాక్ పాంథర్స్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఉద్యమకాలంలోనే దళిత్ అనే పదం వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్యమ కాలంలో వివాదాస్పదమైన ధాలే ఆర్టికల్ కాల స్వాతంత్య్ర దిన్. ఈ ఆర్టికల్ సాధన పత్రికలో వచ్చింది. ఈ ఉద్యమంలో సమంతర్ ఆందోళన్ చేపట్టి ఔరంగాబాద్ లోని మరఠ్వాడ యూనివర్సిటీ పేరు బీఆర్ అంబేద్కర్ మరఠ్వాడ యూనివర్సిటీగా మార్చారు. వీరు పీడిత వర్గాలకు సామాజిక, సాంస్కృతిక గుర్తింపు కోసం కృషి చేశాడు.