
మాదాపూర్, వెలుగు : మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై గత ఆదివారం తెల్లవారుజామున బైక్తో స్టంట్స్ చేసిన యువకులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ కేసు ఫైల్ చేసి, చలాన్ విధించారు. అయితే, స్టంట్స్ చేసిన వారిలో మలక్పేట్కు చెందిన పాలిటెక్నిక్ స్టూడెంట్ అక్బర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడితో అవేర్నెస్ వీడియో చేయించారు. ‘నేను స్టంట్స్ చేయడంతో పోలీసులు నా బైక్కు చలానా వేశారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై అలా చేయను. మీరు కూడా ఇలాంటివి చేయకండి’ అని అక్బర్ చెప్పిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేబుల్ బ్రిడ్జిపై, టీ హబ్ వద్ద ఇదే విధంగా బైక్పై స్టంట్స్ చేసిన సికింద్రాబాద్కు చెందిన రాహుల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.