బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు : రఘునాథ్ యాదవ్

బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు : రఘునాథ్ యాదవ్

చందానగర్, వెలుగు: ఎన్నికలొస్తున్నాయంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేస్తారని.. వాటిని నమ్మొద్దని శేరిలింగంపల్లి కాంగ్రెస్ లీడర్ రఘునాథ్ యాదవ్ జనాలకు సూచించారు. ‘గడపగడపకు రఘన్న’ పాదయాత్రలో భాగంగా గురువారం మియాపూర్​డివిజన్​లోని ఎంఏనగర్​, స్టాలిన్​నగర్ కాలనీల్లో కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలతో కలిసి రఘునాథ్​యాదవ్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్​అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీ పథకాల గురించి జనాలకు వివరించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు రుణమాఫీ, పేదలకు ఇండ్లు, పెన్షన్లు ఇస్తామని చెప్పి  బీఆర్ఎస్ సర్కారు జనాలను మోసం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద సీఎం కేసీఆర్ వందల కోట్లు వెనకేసుకున్నారని..  ఒక్క జిల్లాకు సాగునీరు అందించలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.