మీ పేరెంట్స్​ నాకు ఓటేయ్యకపోతే తినకుండా మారం చేయండి : సంతోష్ బంగార్

మీ పేరెంట్స్​ నాకు ఓటేయ్యకపోతే తినకుండా మారం చేయండి : సంతోష్ బంగార్

ముంబై: ‘మీ తల్లిదండ్రులను నాకు ఓటేయ్యమనండి. నాకు ఓటేయ్యపోతే రెండు రోజుల పాటు తినకుండా మారం చేయండి’ అని ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగార్ పిల్లలకు సూచించారు. ఎన్నికల సంబంధిత అంశాల్లో పిల్లలను ఉపయోగించుకోవద్దని ఈసీ గైడ్ లైన్స్ జారీ చేసి వారం రోజులు కూడా గడవక ముందే ఎమ్మెల్యే ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సంతోష్ బంగార్ కలమ్ నూరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హింగోలి జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘రాబోయే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటేయ్యకపోతే రెండో రోజుల పాటు భోజనం చేయకండి. ఎందుకు తినడం లేదని మీ తల్లిదండ్రులు అడుగుతారు. సంతోష్ బంగార్‌‌‌‌కు ఓటేస్తమని చెబితేనే అప్పుడు మాత్రం తింటాం అని చెప్పండి’’ అని సంతోష్ బంగార్ తెలిపారు.