వాళ్లకు ఓటేసీ ఓటు హక్కును వృథా చేసుకోవద్దు: మమతా బెనర్జీ

వాళ్లకు ఓటేసీ ఓటు హక్కును వృథా చేసుకోవద్దు:  మమతా బెనర్జీ

ఈ ఎన్నికల్లో మీ ఓటుని కాంగ్రెస్ కు కానీ, బీజేపీకి కానీ వేసి, ఓటు హక్కును వృథా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. సిలిగురిలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, తాను అప్పట్లో కాంగ్రెస్‌ను వదలి తృణమూల్ ఏర్పాటు చేశానని, ఇవాళ ప్రజలు చూస్తున్న అభివృద్ధి అంతా అందువల్లే సాధ్యమైందని చెప్పారు.

కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నిచోట్లా గెలవలేవని, సీపీఎం కేరళలో తప్ప మరెక్కడా విజయం సాధించదని ఆమె అన్నారు. కాంగ్రెస్ కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతరం అంతా  బీజీపీ, ఇతర పార్టీలకు కాకుండా దేశాభివృద్దికి పాటు పడే తమ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.