ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు డబుల్ డెక్కర్  ఫ్లై ఓవర్

ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు డబుల్ డెక్కర్  ఫ్లై ఓవర్

 హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు,వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండానికి తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్ లపై ప్రత్యేకంగా  దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ఫ్లై ఓవర్ ల ను ఇప్పటికే  అందుబాటులోకి తెచ్చిన  ప్రభుత్వం ఇపుడు మరో ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.  ఇందులో భాగంగానే  నగర్ శివారులో ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు నిర్మి్ంచనున్న  ఎలివేటెడ్ కారిడార్ (డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ను) ను త్వరగా పూర్తి చేసి ప్రజలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది.  

ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు నిర్మించనున్న రూ.650 కోట్లతో నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..  ఈ కారిడార్ ప్రత్యేకమైందని, ఎల్బీ నగర్  నుంచి హయత్ నగర్, పెద్దఅంబర్ పేట వరకు, ఓఆర్ఆర్ మీదుగా ఎలివేటెడ్  కారిడార్  నిర్మిస్తామన్నారు. వనస్థలిపురం నుంచి హయత్ నగర్  రేడియో స్టేషన్  వరకు సుమారు 6 కి.మీ మెట్రో రైలు మార్గం గుండా ఎలివేటెడ్  కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీకి త్వరలో విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. రూ.2,300 కోట్లతో గౌరెల్లి, వలిగొండ, భద్రాచలం గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరైందని, ఇప్పటికే వలిగొండ తొర్రూరు మధ్య నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. తొర్రూరు, భద్రాచలం మధ్య రోడ్డు పనుల కోసం టెండర్  ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఆందోల్  మైసమ్మ నుంచి విజయవాడ వరకు రూ.375 కోట్లతో రోడ్డు నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నదని, మధ్యలో 17 బ్లాక్ స్పాట్స్ (యాక్సిడెంట్ స్పాట్స్) గుర్తించామని చెప్పారు. 

మళ్లీ కాంగ్రెస్  హయాంలో మెట్రో రెండో దశ

మెట్రో రైలు రెండో దశ అనుమతులకు సంబంధించిన బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచారని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు.  హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మెట్రో మొదటి దశ నిర్మాణం కోసం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషి చేశారని, మళ్లీ కాంగ్రెస్  హయాంలోనే రెండో దశ మెట్రోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాగా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని,  ఎందరో  దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు.