
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్ట్ 15 సందర్బంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఇండియాలో డబుల్ ఇస్మార్ట్ ఐదో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఈ మూవీకి ఐదో రోజున రూ.1.05 కోట్ల నికర వసూళ్లు మాత్రమే తెచ్చుకోవడం పెద్ద మైనస్. అంటే నాలుగో రోజుతో పోలిస్తే ఐదో రోజున 34.38 శాతం కలెక్షన్స్ పడిపోయాయి. ఇక ఇండియా వైడ్గా మొత్తం 5 రోజుల్లో రూ.12.8 కోట్ల నెట్ కలెక్షన్స్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి వచ్చాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇండియా వైడ్గా వచ్చిన మొత్తం కలెక్షన్స్ లో రూ.12.8 కోట్లల్లో రూ.11.7 కోట్ల నెట్ కలెక్షన్స్ తెలుగు నుంచి, 1.1 కోట్లు హిందీ బెల్ట్ నుంచి వచ్చాయి. అలాగే ఇండియా వైడ్ గా ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.14.60 డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే ఓవర్సీస్లో రూ.2.40 కోట్ల వసూళ్లు సాధించుకుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా వరల్డ్ వైడ్గా రూ.17 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా..17.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది.అయితే, ఈ ఓవరాల్ కలెక్షన్స్ చూస్తుంట..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా రిచ్ అవ్వడం చాలా కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకో రూ.49 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందని సమాచారం. ఏదేమైనా వీకెండ్ లో ఇస్మార్ట్ రాణించకపోవడం సినిమా కలెక్షన్స్ కి పెద్ద గండి పడ్డట్టే! దీంతో మరోసారి డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలూ తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్
వరల్డ్ వైడ్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీకి రూ.10.97 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.49 కోట్లుగా ఉండగా..బ్రేక్ ఈవెన్ టార్గెట్ నుంచి వచ్చిన షేర్ కలెక్షన్స్ తీసేస్తే..ఇంకా ఈ సినిమాకు రూ.38.03 కోట్లు రావాలంటూ ట్రేడ్ నిపుణులు అంచనా. అలా వస్తేనే డబుల్ ఇస్మార్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని బాక్సాఫీస్ హిట్ బాటలో పట్టేది. లేదంటే దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వస్తోంది.