
పద్మారావునగర్, వెలుగు: నేషనల్ ఐఎంఏ (ఇన్ సర్వీస్ డాక్టర్స్ వింగ్) వైస్ చైర్మన్ గా గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా. టి.కృపాల్ సింగ్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన ఐఎంఏ సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని నామినేట్ చేశారు.
వైస్ చైర్మన్ గా ఎంపికైన కృపాల్ సింగ్ కు సోమవారం గాంధీ హాస్పిటల్, మెడికల్కాలేజీ అధికారులు, డాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.