హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్యావేత్త, సైకాలజీ నిపుణుడు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ) కౌన్సిలర్ హోదాను అధికారంగా మంజూరు చేసింది. ఈయన 2024–25 విద్యా సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేసన్ సైకాలజీ కోర్సులో 7.45 గ్రేడ్ పాయింట్లతో పాసయ్యారు.
ఈ అర్హత ఆధారంగా ఆయనకు ఆర్సీఐ నుంచి సెంట్రల్ రీహాబిలిటేషన్ రిజిస్టర్ (సీఆర్ఆర్) నమోదు లభించింది. తన విజయానికి మార్గదర్శకులైన ఆచార్య వందనా ఠాకూర్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ తిరునగరి అంజనా మూర్తి, సహాధ్యాయులకు డాక్టర్ శ్రీనాథ చారి కృతజ్ఞతలు తెలిపారు.

