పంతంగి టోల్ ప్లాజా వద్ద 25 కిలోల బంగారం పట్టివేత

పంతంగి టోల్ ప్లాజా వద్ద 25 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటుప్పల్  పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు ఎయిర్ బ్యాగ్ లో బంగారం అమర్చి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కారును సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు..25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని గువహాటి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు అధికారులు. దీని విలువు దాదాపు రూ.11.63కోట్లు ఉంటుందని తెలిపారు. బంగారం తరలిస్తుండగా పట్టుకున్న  ముగ్గురు నిందితులను హైదరాబాద్ డీఆర్ఐ కి తరలించారు.