రాజస్థాన్ సీఎం డ్రైవర్​కి కరోనా

రాజస్థాన్ సీఎం డ్రైవర్​కి కరోనా

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. జైపూర్ బజాజ్ నగర్ కు చెందిన 59 ఏళ్ల వయసున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు సెలవుపై ఇంటికి పంపించారు. మూడ్రోజుల కిందట డ్రైవర్ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం టెస్టులు నిర్వహించారు. రిజల్ట్ పాజిటివ్ రావడంతో అతడిని ఐసోలేషన్ లో ఉంచి అధికారులు కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నారు. డ్రైవర్ నివాస ప్రాంతంలో కర్ఫ్యూ విధించి శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఇప్పటివరకు రాజస్థాన్ లో 3,061 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది చనిపోయారు.