
హైదరాబాద్ సిటీ, వెలుగు: బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఉప్పల్ ఏరియాలో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ నుంచి నాగోల్ ప్రాంతానికి డ్రగ్స్ రవాణా అవుతున్నాయనే సమాచారంతో గురువారం ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుబాష్, ఎస్సైలు కె.వెంకటేశ్వర్లు, ఎ.అనిల్ కుమార్, ఆరుగురు సిబ్బంది కలిసి ఆనంద్నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సమయంలో ఉప్పల్కు చెందిన కె.వెంకట్ మోతీకుమార్ బైక్పై వస్తుండగా తనిఖీ చేశారు. బ్యాగులో రూ.లక్షా 50 వేల విలువైన 21.3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్తో పాటు బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మోతీకుమార్.. మరోవైపు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. బెంగూళూరు నుంచి రూ.3 వేలకు గ్రాము చొప్పున కొని, ఉప్పల్ ఏరియాలో రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నట్లు నిందితుడు తెలిపాడు.