హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఒక్క రోజే 3148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి 239 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. అయితే ఈ డిసెంబర్-31 ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.