- చందానగర్ పరిధిలో ఘటన
చందానగర్, వెలుగు: కల్లు తాగిన మత్తులో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్ చేసుకుంది. చందానగర్ఎస్ఐ రఘు తెలిపిన ప్రకారం.. గోపినగర్ కాలనీ రోడ్డు నం.3 లో ఉండే షమీం బేగం(58) భర్త ఏడాది కింద చనిపోగా కుమార్తె సహేర బేగంతో కలిసి ఉంటుంది. షమీం బేగం కొన్నేళ్లుగా మానసికంగా బాధపడుతుండగా.. రెండేళ్ల కింద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆమెకు రోజూ కల్లు తాగే అలవాటు కూడా ఉంది. ఆదివారం ఇంట్లో కల్లు తాగిన షమీం బేగం రాత్రి 10.30 గంటలకు మెయిన్ డోర్ లాక్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. కేకలు వేయడంతో కూతురు సహేర బేగం తల్లిని కాపాడేందుకు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా లాక్ చేసి ఉంది. ఎలాగోలా బయటకు వచ్చిన సహేర, ఆమె కొడుకు 108 అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం 10 గంటలకు షమీం బేగం మృతి చెందింది. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.