Harish vs Raghunandan : ఉద్రిక్తతల మధ్యే దుబ్బాక కొత్త బస్టాండ్ ప్రారంభం

Harish vs Raghunandan : ఉద్రిక్తతల మధ్యే దుబ్బాక కొత్త బస్టాండ్ ప్రారంభం

సిద్దిపేట జిల్లా : దుబ్బాక కొత్త బస్టాండ్ ను ఉద్రిక్తతల మధ్యే ప్రారంభించారు. దుబ్బాకలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్​, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బస్టాండ్ ప్రారంభంపై ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో.. పోలీసు అధికారులు ఎవరినీ అనుమతించలేదు. 

కేవలం ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే బస్టాండ్ ప్రారంభోత్సవానికి అనుమతిచ్చారు. బస్టాండ్ దగ్గరకు చేరుకున్న బీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయటంతో బస్టాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తల నినాదాల మధ్యనే మంత్రులు బస్టాండ్ ను ప్రారంభించారు. 

గతంలో దుబ్బాక ఎన్నికల్లో బస్టాండే టార్గెట్ గా ఎన్నికల ప్రచారం సాగింది. ఇచ్చిన హామీ మేరకే బస్టాండ్ పూర్తి చేశామని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే... తాను కట్టడటం వల్లే నిర్మాణం త్వరగా పూర్తి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెబుతున్నారు.