Aha OTT: ఆహా ఓటీటీకి మలయాళ కామెడీ థ్రిల్లర్.. పేపర్లో చూసిన అమ్మాయి మర్డర్ ఐతే!

Aha OTT: ఆహా ఓటీటీకి మలయాళ కామెడీ థ్రిల్లర్.. పేపర్లో చూసిన అమ్మాయి మర్డర్ ఐతే!

 

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ తదితర హిట్ చిత్రాలతో మంచి ఫామ్లో ఉన్నాడు  మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్, రానా  దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న 'కాంతా', అలాగే స్వప్ప సినిమాన్ నిర్మాణంలో రూపొందుతున్న'ఆకాశంలో ఒక తారా' అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆహా ఓటీటీ సంస్థ దుల్కర్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది.  2019లో మలయాళం విడుదలైన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ఏంటీ? ఎప్పట్నించి అట్రీమ్ అవుతుంది? దాన్ని కథేంటీ? అనేది చూద్దాం 

మలయాళంలో కామెడీ థ్రిలర్గా తెరకెక్కి అభిమానుల మన్ననలు పొందిన మూవీ 'ఒరు యమండన్ ప్రేమకథ'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్.
ఇపుడీ ఈ సినిమా 'ఒక యముడి ప్రేమకథ' పేరుతో జూన్ 5 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది భవాని మీడియా.

కథేంటంటే:

మోహన్‌లాల్‌ జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే పెయింటర్. అతను లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫోటోని న్యూస్ పేపర్లో చూస్తాడు. తనను ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. తన ఆచూకీని కనిపెట్టడానికి తన ఫ్రెండ్స్ సాయం కూడా తీసుకుంటాడు.

అయితే, కొంతకాలం తర్వాత, దియా హత్యకు గురైందని జాన్‌కు తెలుసుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిందెవరు? అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎలాగైనా హంతకుల్ని గుర్తించి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు.

ఆ తర్వాత అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అసలు దియాను హత్య చేసిందెవరు? ఇందులో సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఏంటీ? చివరికి జాన్ ప్రయత్నం ఎలాంటి నిజాలు రాబట్టింది? అనేది మిగతా స్టోరీ.