యాదగిరిగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

యాదగిరిగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన బుధవారం శివాలయ ముఖమండపంలో హోమాన్ని నిర్వహించి వేదపారాయణాలు, మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణం జరిపారు. అనంతరం భేరిపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ఆలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి, ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ దొమ్మాట సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌శర్మ, అర్చకులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌శర్మ, సాయికృష్ణ శర్మ పాల్గొన్నారు.

ఇయ్యాల శివపార్వతుల కల్యాణం

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి 7 గంటలకు శివపార్వతుల కల్యాణం జరిపించనున్నారు. అంతకుముందు రుద్రహవనం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు. కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచారు. కల్యాణ టికెట్ ధరను రూ.516గా నిర్ణయించారు. ఒక టికెట్‌‌‌‌‌‌‌‌పై దంపతులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.