ముగిసిన కేటీఆర్ విచారణ.. ఫార్ములా ఈ కారు రేసు కేసులో రెండోసారి విచారణ

ముగిసిన కేటీఆర్ విచారణ..  ఫార్ములా ఈ కారు రేసు కేసులో రెండోసారి విచారణ
  •  ఫార్ములా ఈ రేసు కేసులో ప్రశ్నించిన ఏసీబీ
  • 10 గంటలకు న్యాయవాదితో కలిసి ఏసీబీ ఆఫీసుకు
  • అర్వింద్ కుమార్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ
  •   సేకరించిన సాక్ష్యాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు
  • తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హడావిడి

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ ముగిసింది. ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ చేశారు ఏసీబీ అధికారులు. 2025, జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లారు కేటీఆర్. ఏసీబీ ఆఫీసుకు డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి, డీఎస్పీ మాజిద్ ఖాన్, రితిరాజ్ ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఏ2గా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ ఈఈ బీఎల్ ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురినీ ఏసీబీ గతంలో విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను విచారించింది.

అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్లు, ఏసీబీ సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.  కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో క్రాస్ క్వశ్చన్ చేసినట్లు సమాచారం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఏ హోదాలో ఫండ్స్ రిలీజ్ కోసం ఆదేశాలు జారీ చేశారని  కేటీఆర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ క్రమంలో అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి స్టేట్ మెంట్లను బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది?

కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు దాన కిషోర్  స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకుని అర్వింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఎఫ్ఈవోతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఆరా తీశారు. కేబినెట్ ఆమోదం, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నగదు ఎందుకు బదిలీ చేశారని..  ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి? అని అడిగినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపైనా ఏసీబీ ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ముందుంచి ఏసీబీ ప్రశ్నించినట్లు సమాచారం. 

లీగల్ టీంతో హరీశ్ భేటీ

ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు హాజరవగా.. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలతో వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మరికొందరు  నాయకులు ఆయనతో  ఉన్నారు.