
టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. కూకట్పల్లిలోని జెఎన్టీయూహెచ్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంగా లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సాయి దీపిక సెకండ్, కార్తికేయ థర్డ్ ప్లేస్ లో నిలిచారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్ రాగా.. రోహిత్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఎంసెట్ లో క్వాలిఫై అయిన విద్యా్ర్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్లలో కాలేజీల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఈ సెట్ ఫలితాలను సైతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఈసెట్ లో 90.69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 22,001 మంది పరీక్ష రాయగా 19,953 మంది క్వాలిఫై అయ్యారు.
జులై 18 నుంచి 21 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ జరిగాయి. జులై 30, 31వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు సెకండ్ సెషన్ లో పరీక్ష జరిపారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు 1,56,812 మంది హాజరుకాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సులకు నిర్వహించిన పరీక్షను 80,575 మంది రాశారు.