గుజరాత్ లో భూకంపం.. 11 గంటల్లో 7 సార్లు భూప్రకంపనలు...

గుజరాత్ లో భూకంపం.. 11 గంటల్లో 7 సార్లు భూప్రకంపనలు...

గుజరాత్ లోని రాజ్ కోట్ లో వరుస భూప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు జనం. రాజ్ కోట్ జిల్లాలోని జెట్ పూర్ దొరోజి, ఉప్లేటా పరిసర గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. 11 గంటల్లో సుమారు 7 సార్లు భూమి కంపించినట్లు సమాచారం. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రిక్టర్ స్కేల్ పై 3.8 గా తీవ్రత నమోదైంది. ఉదయం 6:19 గంటలకు, ఆ తర్వాత ఉదయం 8:34 గంటలకు మొత్తం ఏడు ప్రకంపనలు సంభవించాయని అంటున్నారు స్థానికులు. ప్రకంపనలకు భయపడి తమ ఇళ్లను వదిలి పొలాలకు పరుగులు తీశారమని అంటున్నారు స్థానికులు.

ఉదయం 6:19 నుండి 8:34 గంటల మధ్య భూకంప ప్రకంపనలు:

  • ఉదయం 06:19: 3.8 తీవ్రతతో భూకంపం
  • 06:56 గంటలకు : 2.9 తీవ్రత
  • 06:58 గంటలకు : 3.2 తీవ్రత
  • 07:10 గంటలకు : 2.9 తీవ్రత
  • 07:13 గంటలకు : 2.9 తీవ్రత
  • 07:33 గంటలకు : 2.7 తీవ్రత
  • 08:34 గంటలకు : మరో భూకంపం సంభవించినట్లు సమాచారం. 

ఉప్లేటా నుంచి తూర్పు ఈశాన్య దిశలో 27 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. భూకంపం లోతు 6.1 కిలోమీటర్ల నుండి 13.6 కిలోమీటర్ల వరకు ఉందని...గురువారం ( జనవరి 8 ) రాత్రి 8:43 గంటలకు ఇదే ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం.