వరదల్లో మునిగిన ఇండ్లను పరిశీలించిన ఈటల

వరదల్లో మునిగిన ఇండ్లను పరిశీలించిన ఈటల

కరీంనగర్: భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జమ్మికుంట పట్టణంలో భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డు కాలనీ నీట మునిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాలనినీ సందర్శించారు. నీట మునిగిన ఇండ్లలోకి స్వయంగా వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద నీటికి తడిసి ముద్దయిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలించారు. కాలనీ వాసులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.