జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ పార్థసారధి స్పష్టత

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ పార్థసారధి స్పష్టత

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇటు అధికార పార్టీకి అటు ప్రతిపక్షాలకు కీలకంగా మారాయి. నవంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని గత వారం మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి కూడా వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ప్రస్తుతానికి తేదీలు ఖరారు చేయలేదని.. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిసైడ్ చేస్తామని ఆయన అన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం చెప్పారు.

For More News..

అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి

కడుపునొప్పని బాలుడిని ఆస్పత్రికి తీసుకెళితే.. కడుపులో ఊహించని విధంగా..

తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు