మోగాలో సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు

మోగాలో సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు

పంజాబ్‌లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది.మొత్తం 176 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.నటుడు సోనూ సూద్‌ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై మోగా నుంచి పోటీ చేస్తున్నారు.ఆమె పోటీ చేస్తున్న మోగా జిల్లాల్లోని ఓ పోలింగ్ సెంటర్ కు కారులో వచ్చాడు సోనూసూద్. అయితే సోనూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అకాలీదళ్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

అంతేకాదు.. సోనూ సూద్ కారును సీజ్ చేశారు.సోనూ సూద్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని జిల్లా పీఆర్వో ప్రభదీప్ సింగ్ అన్నారు. దీంతో కారును సీజ్ చేసి.. సోనూ సూద్‌ను ఇంటికి పంపించామని తెలిపారు.ఇంటి నుంచి ఆయన బయటకు వస్తే కేసులు పెడతామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది