
మనదేశానికి చెందిన ఎలక్ట్రిక్ బైకుల సంస్థ ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ 350 ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్సైకిల్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ-బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 171 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది. బైకులోని 3.5 కిలోవాట్ అవర్ లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ 4 బీహెచ్పీని ఇస్తుంది. ఈ -మోటార్సైకిల్ గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.