చీకోటితో పాటు 6గురు ఏజెంట్లు విచారణకు హాజరు

చీకోటితో పాటు 6గురు ఏజెంట్లు విచారణకు హాజరు

క్యాసినో గ్యాంబ్లర్ చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారిస్తోంది. దాదాపుగా ఏడు గంటలుగా ఈ విచారణ కొనసాగుతున్నది. చీకోటి ప్రవీణ్ తో పాటు 6 గురు ఏజెంట్లు విచారణకు హాజరైయ్యారు. చీకోటితో పాటు అందరిని కలిపి ఈడీ విచారిస్తున్నది. విదేశాల్లో నిర్వహించిన గ్యామ్లింగ్ ఈవెంట్స్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఈవెంట్ నిర్వహణలో ఒక్కో ఏజెంట్ కు ఒక్కో పని అప్పజెప్పెవాడు చీకోటి. ఫ్లైట్ బుకింగ్స్ మొత్తం సంపత్ చూసుకున్నాడని.. హోటల్ బుకింగ్స్, గేమ్ నిర్వహణ, కస్టమర్స్ ఎంటర్ టైన్మెంట్ మిగతా ఏజెంట్లు చూసుకున్నారని ఈడీ విచారణలో వెల్లడైంది. 

ఈడీ విచారణతో కేసులో డొంక కదులుతోంది. క్యాసినో, మనీ లాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యారు. క్యాసినో, మనీ లాండరింగ్ కేసులో మొత్తం ఆరుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణలో భాగంగా చీకోటీ హాజరవ్వగా... మరో ఐదుగురు విచారణకు రావాల్సి ఉంది. క్యాసినో మాటున భారీ హవాలా రాకెట్ నడుస్తున్నట్లు అనుమానిస్తున్న ఈడీ.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది.

చీకోటి ప్రవీణ్ కు ఐదు రాష్ట్రాల్లోని ప్రముఖులతో లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు వివిధ బ్యాంక్ సంస్థల నుంచి అన్ని ఆధారాలు ఈడీ తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులు క్రితం ఏకకాలంలో ఎనిమిది ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ  సోదాల్లో ఫోన్లు, పాత్రలు గోల్డ్ లాప్ టాప్స్ సీజ్ చేశారు అధికారులు.