ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్కు ఈడీ నోటీసులు.. !

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్కు ఈడీ నోటీసులు.. !

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న ఈడీ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారన్న విషయంపై మాత్రం రోహిత్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం నోటీసు అందిన విషయాన్ని మాత్రమే రోహిత్ రెడ్డి కన్ఫామ్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు సినీ హీరోయిన్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

తనకు ఈడీ నుంచి నోటీస్ అందిందని పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. కానీ అది ఏ కేసులో అనేది మాత్రం నోటీస్ లో లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపైనా విచారణ కు రావాలని నోటీస్ లో ఉన్నట్టు తెలిపారు. 19న ఈడీ విచారణకు హాజరు కావడంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు రోహిత్ రెడ్డి చెప్పారు.