ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. రాత్రి 8.45కి ఫ్లైట్ బుక్ చేసిన ఈడీ

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. రాత్రి 8.45కి ఫ్లైట్ బుక్ చేసిన ఈడీ

హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ కి తరలించనున్నారు. రాత్రి 8.45 కి ఫ్లైట్ బుక్ చేసిన ఈడీ అధికారులు.శుక్రవారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచిఈడీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మొత్తం 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీకవిత, ఆమె భర్త, సిబ్బందితో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం  ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.