న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మనుమడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్కు చెందిన కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో జరిగిన రూ.25 వేల కోట్ల స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం ఈ దాడులు చేపట్టారు.
రోహిత్ పవార్ సీఈవోగా ఉన్న బారామతి ఆగ్రో, దాని అనుబంధ సంస్థల్లో సోదాలు జరిగాయి. బారామతి, పుణె, ఔరంగాబాద్, అమరావతితో సహా ఆరు చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.