ఢిల్లీ క్లాస్‌‌ రూమ్స్ కుంభకోణంలో ఈడీ స్పీడప్.. ఒకే రోజు 37 చోట్ల దాడులు

ఢిల్లీ క్లాస్‌‌ రూమ్స్ కుంభకోణంలో ఈడీ స్పీడప్.. ఒకే రోజు 37 చోట్ల దాడులు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.2 వేల కోట్ల క్లాస్‌‌ రూమ్స్​నిర్మాణ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని 37 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రదేశాల్లో దాడులు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆప్ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‎పై ఆరోపణలు ఉన్నాయి. 

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 12 వేలకు పైగా క్లాస్‌‌రూమ్‌‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఏప్రిల్​30న ఢిల్లీ ఏసీబీ ఎఫ్ఐఆర్​ దాఖలు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దాడులు చేపట్టింది. 2015 నుంచి 2023 మధ్య జరిగిన ఈ ప్రాజెక్టులో రూ.2,892 కోట్ల వ్యయం జరిగినట్లు ఏసీబీ ఆరోపించింది. ఒక్కో క్లాస్‌‌రూం నిర్మాణానికి సాధారణంగా రూ. 5 లక్షలు ఖర్చవుతుందని, ఈ ప్రాజెక్టులో రూ.24.86 లక్షలు ఖర్చు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లలో ఎక్కువమంది ఆప్‌‌తో సంబంధం ఉన్నోళ్లేనని ఆరోపణలు ఉన్నాయి.