ఫిబ్రవరి 24న ఎడ్యుకేషన్ ​ఫెయిర్

 ఫిబ్రవరి 24న ఎడ్యుకేషన్ ​ఫెయిర్

పంజగుట్ట, వెలుగు: విదేశాల్లో చదువు కోవాలనుకునే విద్యార్థుల సౌకర్యార్థం యూఎస్ కు చెందిన 15 వర్సిటీల ప్రతినిధులతో  ఎడ్యుకేషన్ ఫెయిర్ ​నిర్వహిస్తున్నట్టు యూనిస్కాలర్స్​ సౌత్​ ఇండియా హెడ్​రాజ్​ మున్నా తెలిపారు. ఈ నెల 24న సోమాజిగూడలోని తమ ఆఫీస్​లో యూఎస్​ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని చెప్పారు.

విదేశీ విద్యతో పాటు బ్యాంకు లోన్​ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. సంస్థ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు స్కాలర్​షిప్​ మంజూరు చేస్తామని చెప్పారు. సమావేశంలో సంస్థ  ప్రతినిధులు రాజేష్​, దివ్య, తేజశ్విని, గురుప్రీత్​ పాల్గొన్నారు.