పంజగుట్ట, వెలుగు: విదేశాల్లో చదువు కోవాలనుకునే విద్యార్థుల సౌకర్యార్థం యూఎస్ కు చెందిన 15 వర్సిటీల ప్రతినిధులతో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు యూనిస్కాలర్స్ సౌత్ ఇండియా హెడ్రాజ్ మున్నా తెలిపారు. ఈ నెల 24న సోమాజిగూడలోని తమ ఆఫీస్లో యూఎస్ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని చెప్పారు.
విదేశీ విద్యతో పాటు బ్యాంకు లోన్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. సంస్థ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు చేస్తామని చెప్పారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు రాజేష్, దివ్య, తేజశ్విని, గురుప్రీత్ పాల్గొన్నారు.