వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవనానికి కృషి చేస్త

వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవనానికి కృషి చేస్త

వికారాబాద్, వెలుగు :  జిల్లా కోర్టుకు స్థలం,  భవన నిర్మాణానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  స్పీకర్ కు ఆత్మీయ సన్మానం చేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు శాలువాలు,  బొకేలతో ఆయనను ఘనంగా సత్కరించారు.  

స్పీకర్  మాట్లాడుతూ.. జిల్లా కోర్టుకు  ప్రస్తుతం నీటిపారుదల శాఖ వాడుకునే క్యాడ్ స్థలాన్ని కేటాయించడానికి జిల్లా అధికారులను ఆదేశిస్తారని తెలిపారు. జిల్లా కోర్టు సముదాయానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు పరిశీలన చేపడతామని పేర్కొన్నారు.