ట్రిపుల్ తలాక్ను ఒకే ఒక్క బిల్లుతో నేరంగా మార్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. చాలా మంది దానిని వ్యతిరేకిస్తున్నా, ముస్లిం మహిళలు మాత్రం చాలా సంతోషిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ‘ట్రిపుల్ తలాక్’తో పడుతున్న బాధలను తీర్చేశారని పెద్దన్నగా భావిస్తున్నారు. అందుకే వారణాసికి చెందిన కొందరు ముస్లిం మహిళలు చేతితో రాఖీలు తయారు చేసి మోడీకి పంపించారు. ట్రిపుల్ తలాక్ను క్రిమినలైజ్ చేసిన మోడీయే తమకు పెద్దన్న అని హుమాబానో అనే మహిళ సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ ముస్లిం లీగ్ మాత్రం ఇదంతా ఒక ప్రచార స్టంట్ అని ఎద్దేవా చేసింది. ప్రభుత్వం ముస్లిం మహిళలను నయానో,భయానో తమ వైపుకు తిప్పుకుని ప్రచారానికి వాడుకుంటోందని విమర్శించింది. పాకిస్తాన్ సహా పెద్ద పెద్ద ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్ను నిషేధించాయి