హైదరాబాద్, వెలుగు : 10 నుంచి ప్రారంభం కానున్న టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్లు ఆదివారం ఉదయం వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చాయి. రాత్రి 8 గంటల వరకు 1.75 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్ నంబర్, ఇంటర్ హాల్ టికెట్, డేటాఫ్ బర్త్ వివరాలతో https://eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కోకన్వీనర్ విజయకుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి దాకా 3.20 లక్షల మందికి పైగా ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఎలాంటి ఫైన్ లేకుండా 3,11,555 మంది, రూ.250 ఫైన్తో 5,983 మంది, రూ.500 ఫైన్తో 1937 మంది, రూ.2500 ఫైన్ తో 404 మంది, రూ.5 వేల ఫైన్తో మిగిలిన స్టూడెంట్లు అప్లై చేశారని వివరించారు. మే 2తో రూ.5 వేల ఫైన్తో దరఖాస్తు గడువు ముగియనుందని తెలిపారు.