- ఒకరోజు బేసిక్ శాలరీ ఇస్తున్నట్లు సీఎంకు ఉద్యోగుల జేఏసీ లెటర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జేఏసీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు ఒకరోజు బేసిక్ శాలరీ సుమారు రూ.33 కోట్లను సీఎంఆర్ఎఫ్ కు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ సీఎం కేసీఆర్ కు లెటర్ రాసింది. ఉద్యోగుల జేఏసీ చైర్మర్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ మమత బుధవారం ఆ లెటర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు. వరద బాధితులకు సాయం చేసేందుకు సర్కార్ పూర్తి స్థాయిలో సహాయం చేస్తోందని ఉద్యోగుల జేఏసీ తెలిపింది.