బస్టాండ్ లో హత్య.. వెంటనే నేరస్తుడి ఎన్ కౌంటర్

బస్టాండ్ లో హత్య.. వెంటనే నేరస్తుడి ఎన్ కౌంటర్

బీహార్ లో పట్టపగలే ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక క్రిమినల్ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని ముజఫర్ బస్ స్టాండ్ లో  కుందన్ సింగ్ అనే వ్యక్తి బస్సులో కూర్చుని ఉన్నాడు. అక్కడికి చేరుకున్న ముగ్గురు క్రిమినల్స్.. కుందన్ పై 4రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. లైవ్ మర్డర్ చూసిన ప్రయాణికులు భయపడ్డారు.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా ఇద్దరు క్రిమినల్స్ తప్పించుకు పారిపోయారు. ఒక క్రిమినల్ మాత్రం బస్సులోనే ఉండి పోయాడు. ముందుగా సరెండర్ అవ్వాలని పోలీసులు కోరగా.. అతను మాత్రం పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో  పోలీసులు ఎదురుకాల్పులు జరుపగా.. క్రిమినల్ చనిపోయాడు. ఇదంతా స్థానిక జనం చూస్తుండగానే జరిగింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మర్డర్ పై విచారణ చేపట్టారు.