కాళేశ్వరంలో అంతులేని అవినీతి : మురళీధర్ రావు

కాళేశ్వరంలో అంతులేని అవినీతి : మురళీధర్ రావు
  •      పదేండ్లు అధికారం ఇస్తే పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం అవినీతికి అంతే లేదని, రీ డిజైన్ పేరుతో ప్రాజెక్టు కాస్ట్ ను పెంచి భారీగా దోచుకున్నారని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్​ మురళీధర్ రావు ఆరోపించారు. పదేండ్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మితే, రాష్ట్ర ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని కేసీఆర్ ఎన్నో డైలాగ్ లు చెప్పారని, పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.