ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. సాయి మనోజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన మనోజ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ కు చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మనోజ్ అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన వ్యక్తి.