మూడో టెస్టులో భారత్ ఘోర ఓటమి

మూడో టెస్టులో భారత్  ఘోర ఓటమి

ఇంగ్గాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓడిపోయింది. మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన ఇండియా 278 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత ఆటగాళ్లలో రోహిత్ 69,పుజారా 91,కోహ్లీ 55, జడేజా 30 పరుగులతో రాణించగా.. మిగతా వారు అట్టర్ ప్లాప్ అయ్యారు. దీంతో 278కే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ 5 వికెట్లు,  ఓవర్టన్ 3, అండర్సన్, మొయిన్ అలీలకు చెరో వికెట్ పడ్డాయి. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 432 పరుగులకు  ఆలౌట్ అయ్యింది.